IPL 2023: విరుచుకుపడిన కోహ్లీ.. రెండో అర్ధ సెంచరీ!

ABN , First Publish Date - 2023-04-10T20:28:39+05:30 IST

లక్నో సూపర్ జెయింట్స్‌(LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో

IPL 2023: విరుచుకుపడిన కోహ్లీ.. రెండో అర్ధ సెంచరీ!

బెంగళూరు: లక్నో సూపర్ జెయింట్స్‌(LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు(RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) చెలరేగాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడు మ్యాచుల్లో కోహ్లీకి ఇది రెండో అర్ధ సెంచరీ కావడం గమనార్హం.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఇన్నింగ్స్‌ను దూకుడుగా మొదలుపెట్టింది. కెప్టెన్ డుప్లెసిస్ (Du Plessis) నిదానంగా ఆడగా, కోహ్లీ బ్యాట్ ఝళిపించాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాక మరో సిక్సర్ బాదిన కోహ్లీ.. అమిత్ మిశ్రా బౌలింగులో మరో భారీ షాట్‌కు యత్నించి స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మొత్తంగా 44 బంతులు ఆడిన కోహ్లీ 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిశాయి. బెంగళూరు వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. డుప్లెసిస్ 32, మ్యాక్స్‌వెల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2023-04-10T20:28:39+05:30 IST