WTC final: డబ్ల్యూటీసీ విజేత గెలుచుకోబోయే ప్రైజ్‌ మనీ ప్రకటించిన ఐసీసీ.. వామ్మో ఇంత భారీ మొత్తమా?

ABN , First Publish Date - 2023-05-26T18:41:15+05:30 IST

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 విజేత ( World Test Championship 2021-23) గెలుచుకోబోయే ప్రైజ్ మనీని (Prize money) ఐసీసీ (ICC) ప్రకటించింది. గత ఛాంపియన్‌షిప్ 2019-21 మాదిరిగానే 2021-23లో కూడా రూ.31.4 కోట్ల మొత్తాన్ని ప్రకటించింది.

WTC final: డబ్ల్యూటీసీ విజేత గెలుచుకోబోయే ప్రైజ్‌ మనీ ప్రకటించిన ఐసీసీ.. వామ్మో ఇంత భారీ మొత్తమా?

ముంబై: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 విజేత ( World Test Championship 2021-23) గెలుచుకోబోయే ప్రైజ్ మనీని (Prize money) ఐసీసీ (ICC) ప్రకటించింది. గత ఛాంపియన్‌షిప్ 2019-21 మాదిరిగానే 2021-23లో కూడా రూ.31.4 కోట్ల మొత్తాన్ని ప్రకటించింది. ఈ భారీ మొత్తాన్ని 9 జట్లు పంచుకోనున్నాయని వెల్లడించింది. కాగా జూన్ 7న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్‌ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు ఏకంగా రూ.13.22 కోట్లు ఇంటికి తీసుకెళ్లనుంది. ఇక రన్నర్‌గా నిలిచే జట్టు రూ.6.61 కోట్లు గెలుచుకోనుంది. ఈ టోర్నమెంట్ ప్రైజ్ మనీలో ఎలాంటి మార్పు లేదని ఈ సందర్భంగా ఐసీసీ స్పష్టం చేసింది.

Updated Date - 2023-05-26T18:41:15+05:30 IST