Women Wrestlers: బ్రిజ్ భూషణ్ కేసుల్లో ఏడుగురు మహిళా రెజ్లర్ల వాంగ్మూలాల నమోదు

ABN , First Publish Date - 2023-05-06T09:16:26+05:30 IST

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నమోదైన కేసులకు సంబంధించి కీలక పరిణామం...

Women Wrestlers:  బ్రిజ్ భూషణ్ కేసుల్లో ఏడుగురు మహిళా రెజ్లర్ల వాంగ్మూలాల నమోదు
Women Wrestlers

న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నమోదైన కేసులకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.(Women Wrestlers) ఈ కేసుల్లో ఢిల్లీ పోలీసులు ఏడుగురు మహిళా రెజ్లర్ల వాంగ్మూలాలను(Statements Of 7 Women Wrestlers) నమోదు (Recorded)చేశారు.(Women Wrestlers)బ్రిజ్ భూషణ్ సింగ్‌పై(Against Wrestling Body Chief) మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఏప్రిల్ 28వతేదీన ఢిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి : Two Encounters : రాజౌరి,బారాముల్లాలో రెండు ఎన్‌కౌంటర్లు...ఉగ్రవాది హతం

సింగ్‌పై ఐపీసీ సెక్షన్‌లు 354, 354 ఎ, 354డి,పోక్సో చట్టం కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో రెజ్లర్ల వాంగ్మూలాలను నమోదు చేశామని, విచారణ జరుగుతోందని ఓ పోలీసు అధికారి తెలిపారు.ఎఫ్‌ఐఆర్‌లలో పేర్కొన్న సంఘటనలు 2012, 2022 మధ్య విదేశాలతో సహా వివిధ ప్రదేశాల్లో జరిగాయి.బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏప్రిల్ 23వతేదీ నుంచి జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు బైఠాయించారు.

Updated Date - 2023-05-06T09:33:38+05:30 IST