Share News

BRS Vs Congress : పరకాల నామినేషన్ కేంద్రం వద్ద హై టెన్షన్..

ABN , First Publish Date - 2023-11-09T11:49:54+05:30 IST

పరకాలలో నామినేషన్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేడు మంచి రోజు కావడంతో పెద్ద ఎత్తున నేతలు నామినేషన్స్ వేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు.

BRS Vs Congress : పరకాల నామినేషన్ కేంద్రం వద్ద హై టెన్షన్..

హనుమకొండ : పరకాలలో నామినేషన్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేడు మంచి రోజు కావడంతో పెద్ద ఎత్తున నేతలు నామినేషన్స్ వేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అలాగే అన్ని పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కాగా.. కాసేపటి క్రితం నామినేషన్ వేసేందుకు పరకాల నామినేషన్ కేంద్రానికి ఏకకాలంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురు పడటంతో పరస్పర నినాదాలతో హోరెత్తించారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో పరకాలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Updated Date - 2023-11-09T11:49:55+05:30 IST