Home » Assembly elections
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం'రహస్యం'గా డీఎంకేకు సహకరిస్తోందని విజయ్ ఆరోపించారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం కాంగ్రెస్ వైపు డీఎంకే ఉంటూ, కుంభకోణాలప్పుడు రహస్యంగా బీజేపీ సైడ్ ఉంటోందని అన్నారు. తమళనాడు పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు.
కేంద్ర హోం మంత్రి అమిత్షాను పళనిస్వామి, ఆ పార్టీ సీనియర్ నేతలు న్యూఢిల్లీలో మంగళవారంనాడు కలుసుకున్నారు. దీంతో పొత్తు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే తమ సమావేశం వివరాలపై ఆయన క్లుప్తంగా మాట్లాడుతూ, ప్రజలకు సంబంధించిన అంశాలపైనే తాము మాట్లాడామని చెప్పారు.
తమిళనాడులో వరుసగా రెండోసారి అధికారంలో ఉన్న డీఎంకే 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. తమిళనాడులో పార్టీ బలం పెంచుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉన్నప్పటికీ డీఎంకేకు దీటైన పార్టీగా అన్నాడీఎంకే రెండవ బలమైన పార్టీగా ఉంది.
Maharashtra Politics: మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. గతేడాది నవంబర్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటరు మహా వికాస్ అఘాడీకి పట్టం కట్టారు. దీంతో ఆ కూటమికి 235 స్థానాలను కైవసం చేసుకుంది.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండాకుల గుర్తుపైనే పోటీ చేయనున్నట్లు తెలిపారు.
గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఇప్పటి వరకూ పొత్తులపై ఎలాంటి చర్చలు జరగలేదని ఆప్ సీనియర్ నేత అతిషి చెప్పారు.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar)తో తిరిగి చెలిమికి ఆర్జేడీ మంతనాలు సాగిస్తోందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆర్జేడీ నేత నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఆదివారంనాడు ఘాటు సమాధానం ఇచ్చారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సపోర్ట్తో ముఖ్యమంత్రి స్థాయికి నితీష్ కుమార్ ఎదిగారని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్కు అనుగుణంగా కేంద్రంలో నితీష్ పొత్తు సాగిస్తున్నారని సమ్రాట్ చౌదరి చెప్పారు.
గత ఏడాది మేలో బీజేపీ నుంచి పవన్ సింగ్ను పార్టీ అదిష్ఠానం బహిష్కరించింది. కారాకాట్ నియోజకవర్గం నుంచి ఎన్డీయే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించడంతో పార్టీ ఆదేశాలకు ఆయన ధిక్కరిస్తూ స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ పోటీలోకి దిగారు.
రాజకీయ మార్పును ఆశిస్తూ బీహార్లో జన్ సురాజ్ పార్టీ, తమిళనాడులో దళపతి విజయ్ పార్టీ ఎన్నికలకు వెళ్తున్నాయని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. తమిళనాడులో మార్పు తేవాలనే ఆశయంతో ఉన్న ఆయనకు ఎన్నికల వ్యూహకర్తగా తనకున్న అనుభవం జోడించి సహకరిస్తానని చెప్పారు.