Hyderabad: శ్రీచైతన్య విద్యా సంస్థల అధినేత కన్నుమూత

ABN , First Publish Date - 2023-07-13T16:56:07+05:30 IST

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు కన్నుమూశారు. ఆయన బాత్‌రూమ్‌లో ప్రమాదవశాత్తు జారిపడిపోయి.. తీవ్రంగా గాయపడి మృతిచెందారు.

Hyderabad: శ్రీచైతన్య విద్యా సంస్థల అధినేత కన్నుమూత

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన శ్రీచైతన్య (Srichaitanya) విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు (Dr. Boppana Satyanarayana Rao) కన్నుమూశారు. బాత్‌రూమ్‌లో ప్రమాదవశాత్తు జారిపడిన ఆయన తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

కుటుంబసభ్యులు బీఎస్‌రావు భౌతికకాయాన్ని మరి కాసేపట్లో విజయవాడకు తరలించనున్నారు. అక్కడే అంత్యక్రియలు జరపనున్నారు. బీఎస్‌రావు పూర్తిపేరు బొప్పన సత్యనారాయణ రావు. శ్రీచైతన్య విద్యా సంస్థలను 1986లో ప్రారంభించారు. అనతికాలంలోనే సంస్థలను అగ్రగామి పథంలో నడిపించారు.

Updated Date - 2023-07-13T17:07:50+05:30 IST