Share News

TS HighCourt: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

ABN , Publish Date - Dec 19 , 2023 | 11:41 AM

Telangana: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది.

TS HighCourt: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఘటన జరిగిన సమయంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి పలు ఫిర్యాదులు వెళ్లాయి. వచ్చిన ఫిర్యాదులను అనుసరించి రాష్ట్ర సీఎస్‌కు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి లేఖ రాసింది. సీఎస్ నుంచి సమాచారం తీసుకుని రెండు వారాల్లోపు పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 19 , 2023 | 11:45 AM