Hyderabad: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పోచారం శ్రీనివాస రెడ్డి

ABN , First Publish Date - 2023-09-17T08:40:07+05:30 IST

హైదరాబాద్: సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Hyderabad: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పోచారం శ్రీనివాస రెడ్డి

హైదరాబాద్: సెప్టెంబర్ 17 (September 17) తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యతా దినోత్సవం (National Unity Day of Telangana State) సందర్భంగా ఆదివారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి (Pocharam Srinivasa Reddy) జాతీయ పతాకాన్ని (National flag) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ నరసింహా చార్యులు, బీఆర్ఎస్ఎల్పీ (BRSLP) సెక్రటరీ రమేష్ రెడ్డి, శాసనసభ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అలాగే తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దండే విఠల్, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, బోగరపు దయానంద్, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ నరసింహా చార్యులు, బి ఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-17T08:40:07+05:30 IST