Share News

Road Accident: రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తుడు మృతి

ABN , Publish Date - Dec 14 , 2023 | 10:24 AM

Telangana: మేడ్చల్ జాతీయ రహదారి కొంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లారీ - భైక్ ఢీకొన్న ఘటనలో అయ్యప్పస్వామి మాలధారణ వ్యక్తి మృతి చెందారు.

Road Accident: రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తుడు మృతి

మేడ్చల్: మేడ్చల్ జాతీయ రహదారి కొంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లారీ - భైక్ ఢీకొన్న ఘటనలో అయ్యప్పస్వామి మాలధారణ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాధమిక దర్యాప్తులో మృతుడు ఉషన్ గారి వెంకటేశ్ అని.. ఎస్‌బీఐ బ్యాంకులో ఔట్ సోర్స్ ఉద్యోగిగా గుర్తించారు. అతి వేగంగా, నిర్లక్ష్యంగా లారీ డ్రైవ్ చేయడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Dec 14 , 2023 | 10:24 AM