Niranjan Reddy: అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్‌కు రేవంత్ పిండం పెడుతున్నారు

ABN , First Publish Date - 2023-08-09T15:06:26+05:30 IST

కేసీఆర్‌పై రేవంత్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ను తిడితే రేవంత్ పెద్దోడు కాలేడు. రేవంత్ ఫ్రస్టేషన్ ఇలాగే ఉంటే కింది స్థాయిలో రియాక్షన్ వేరేలా ఉంటుంది. అమరుల వీరుల స్థూపం దగ్గర చర్చ అని రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదం. తన సవాల్‌కే నిలబడని రేవంత్‌తో మాట్లాడేందుకు ఎవరు రారు.

Niranjan Reddy: అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్‌కు రేవంత్ పిండం పెడుతున్నారు

హైదరాబాద్: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌పై రేవంత్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ను తిడితే రేవంత్ పెద్దోడు కాలేడు. రేవంత్ ఫ్రస్టేషన్ ఇలాగే ఉంటే కింది స్థాయిలో రియాక్షన్ వేరేలా ఉంటుంది. అమరుల వీరుల స్థూపం దగ్గర చర్చ అని రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదం. తన సవాల్‌కే నిలబడని రేవంత్‌తో మాట్లాడేందుకు ఎవరు రారు. కాంగ్రెస్‌ను ఏం చేయబోతున్నారో ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్‌కు రేవంత్ పిండం పెడుతున్నారు. సోనియాను బలి దేవత అని రేవంత్ మాట్లాడలేదా? కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్నాం.’’ అని అన్నారు.

Updated Date - 2023-08-09T15:06:26+05:30 IST