Hyderabad: ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న వెంకయ్య

ABN , First Publish Date - 2023-09-21T14:18:04+05:30 IST

కుటుంబ సమేతంగా వచ్చి.. బడా గణేష్‌ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. శాసన సభ్యులుగా ఉన్నప్పటి నుంచి గణేష్‌ని దర్శించుకుంటున్నా. ప్రజలు అందరు సుఖంగా సంతోషంగా ఉండాలి అని గణపతిని ప్రార్థించా.

Hyderabad: ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న వెంకయ్య

హైదరాబాద్: ఖైరతాబాద్ 63 అడుగుల దశమహా విద్య గణపతిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah naidu) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడారు. ‘‘కుటుంబ సమేతంగా వచ్చి.. బడా గణేష్‌ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. శాసన సభ్యులుగా ఉన్నప్పటి నుంచి గణేష్‌ని దర్శించుకుంటున్నా. ప్రజలు అందరు సుఖంగా సంతోషంగా ఉండాలి అని గణపతిని ప్రార్థించా. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ చైర్మన్ సింగారి సుదర్శన్ ప్రస్తుతం మనతో లేకపోవడం బాధగా ఉంది. ప్రతి ఒక్కరికి దైవ భక్తి వల్ల సంతృప్తి కలుగుతుంది. దేశంలో సమైక్యత, గురుభావం, దైవ భక్తి పెరుగుతుంది. భారత దేశం శక్తి వంతంగా తయారవుతుంది. ఇలానే దేశం ముందుకు వెళ్లాలని కోరుకొంటున్నా.’’ అని వెంకయ్య తెలిపారు.

Updated Date - 2023-09-21T14:19:25+05:30 IST