Revanth Reddy: వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మోసం చేశారు..

ABN , First Publish Date - 2023-03-05T12:35:48+05:30 IST

వేములవాడ(Vemulawada) నియోజకవర్గంలో హాత్ సే జూడో యాత్ర(Hath Se Judo trip) పేరుతో టీపీసీసీ...

Revanth Reddy: వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మోసం చేశారు..

రాజన్న సిరిసిల్ల: వేములవాడ(Vemulawada) నియోజకవర్గంలో హాత్ సే జూడో యాత్ర(Hath Se Judo trip) పేరుతో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి(TPCC President Revanth Reddy) చేపట్టిన జూడో యాత్ర 21 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా (నేడు) ఆదివారం వేములవాడ రాజరాజేశ్వరస్వామిని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. వేములవాడ రాజన్నను కూడా సీఎం కేసీఆర్(Cm Kcr) మోసం చేశారని ధ్వజమెత్తారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారని, గతంలో కాంగ్రెస్(Congress) హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందని అన్నారు. ప్రభుత్వం మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో కొర్రీలు పెడుతోందని మండిపడ్డారు. పెళ్ళైన ఆడపిల్లలకు వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదన్నారు. దొరలకు ఒక నీతి... గిరిజనులకు ఒక నీతా? అంటూ కేసీఆర్‎ ప్రభత్వంపై మరోసారి రేవంత్ మండిపడ్డారు.

Updated Date - 2023-03-05T12:37:09+05:30 IST