TS News: కరెంట్ బిల్లు కట్టే విషయంలో తగాదా.. తండ్రి హత్య

ABN , First Publish Date - 2023-08-29T15:39:19+05:30 IST

వికారాబాద్ మండలం అత్తెల్లి గ్రామంలో దారుణం జరిగింది. ఇంటి కరెంట్ బిల్లు విషయంలో తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తండ్రి కొడుకులిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. కరెంట్ బిల్లు కట్టే విషయంలో గొడవ జరిగింది.

TS News: కరెంట్ బిల్లు కట్టే విషయంలో తగాదా.. తండ్రి హత్య

వికారాబాద్: వికారాబాద్ మండలం అత్తెల్లి గ్రామంలో దారుణం జరిగింది. ఇంటి కరెంట్ బిల్లు విషయంలో తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తండ్రి కొడుకులిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. కరెంట్ బిల్లు కట్టే విషయంలో గొడవ జరిగింది. ఈ వాగ్వాదం కాస్తా ప్రాణాలు తీసేదాకా వెళ్లింది. ఇరువురు కలిసి గ్రామస్తుల దగ్గర పంచాయితీ ఏర్పాటు చేశారు. గొడవ విషయంపై గ్రామస్తులు మాట్లాడుతుండగా తండ్రి రాంచంద్రయ్యపై కుమారుడు యాదయ్య రాడ్‌తో దాడి చేశాడు. అక్కడికక్కడే రాంచంద్రయ్య ప్రాణాలు వదిలేశాడు. కేసు నమోదు చేసుకున్న వికారాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-08-29T15:39:19+05:30 IST