BRS MLA Victim: ఢిల్లీలో శేజల్ నిరవధిక దీక్ష
ABN , First Publish Date - 2023-06-19T19:06:26+05:30 IST
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడని, పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద శేజల్ నిరవధిక దీక్ష చేపట్టారు.
బెల్లంపల్లి: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడని, పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద శేజల్ నిరవధిక దీక్ష చేపట్టారు. రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయ దీక్ష చేశారు. ఎమ్మెల్యేపై కేసునమోదు చేయాలని డిమాండ్ చేశారు. దుర్గంపై చర్యలు చేసుకోవాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు పట్టించుకోవడం లేదని శెజల్ వాపోయారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ 404లో తనపై లైంగిక దాడికి ఎమ్మెల్యే పాల్పడ్డారని, ప్రభుత్వం సీసీ పుటేజీలను బయట పెట్టి ఎమ్మెల్యే నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎమ్మెల్యే అండదండలతో సోషల్ మీడియాలో, వాట్సప్ కాల్స్తో తనపై యాసిడ్ పోసి చంపుతానని బెదిరించిన ఎమ్మెల్యే అనుచరులు రమణ, చిల్లరపు సంతోష్, కుమ్మరి పోచన్న, కార్తీక్, భీమాగౌడ్, గోలి శివ, సున్నం రాజులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరిజన్ డెయిరీ మీద పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడం వల్ల నష్టపోయిన బాధితులను తక్షణమే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తమకు అన్యాయం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. తనకు న్యాయం జరిగే వరకు నిరవధిక దీక్ష చేపడతానని శేజల్ పేర్కొంది.