Union Minister Kishan Reddy: ఫోటోలు తీయవద్దు.. ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాను..

ABN , First Publish Date - 2023-10-10T08:20:15+05:30 IST

ఫోటోలు తీయవద్దు.. ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చానని ఫోటోగ్రాఫర్‌ను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వారించాడు.

Union Minister Kishan Reddy: ఫోటోలు తీయవద్దు.. ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాను..

రెజిమెంటల్‌బజార్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ఫోటోలు తీయవద్దు.. ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చానని ఫోటోగ్రాఫర్‌ను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వారించాడు. సోమవారం సికింద్రాబాద్‌లో ఉన్న ఓ కేఫ్‌కు మంత్రి కిషన్‌రెడ్డి వస్తున్నారనే సమాచారంతో వెళ్లిన ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఫోటోగ్రాఫర్‌ కిషన్‌ రెడ్డిని ఫోటో తీస్తుండగా వద్దని కిషన్‌ రెడ్డి సూచించారు. పబ్లిక్‌ ప్లేస్‌లోకి వచ్చి మీడియా కవరేజ్‌ వద్దనడంతో మీడియా వారు అశ్చర్యపోయారు. అనంతరం ప్యాట్నీ సెంటర్‌లో ఉన్న మరో కేఫ్‌కు వెళ్లి అక్కడ నుంచి అటోలో పరేడ్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. మెట్రోరైలులో సుల్తాన్‌బజార్‌కు వెళ్లినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. చాయ్‌ పే చర్చ అనుకున్న బీజేపీ నాయకులకు దానిగురించి కాదని షూట్‌ కొరకు వచ్చినట్లు అలస్యంగా తెలుసుకున్నారు. కేంద్రమంత్రి వస్తే సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకునే స్థానిక బీజేపీ నాయకులు పోస్టింగ్‌లు పెట్టకపోవడం గమనార్హం.

REDDY.jpg

Updated Date - 2023-10-10T08:20:15+05:30 IST