Share News

Telangana Elections : సీఎం కేసీఆర్‌కు కోటి.. రాజగోపాల్‌కు కోటిన్నర అప్పు ఇచ్చిన వివేక్

ABN , First Publish Date - 2023-11-12T16:25:01+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ వెంకట స్వామి(Vivek Venkataswami)కి రూ.కోటి అప్పు ఉన్నారు. వెంకటస్వామి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోనే ఈ విషయం బయటపడింది.

Telangana Elections : సీఎం కేసీఆర్‌కు కోటి.. రాజగోపాల్‌కు కోటిన్నర అప్పు ఇచ్చిన వివేక్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ వెంకట స్వామి(Vivek Venkataswami)కి రూ.కోటి అప్పు ఉన్నారు. వెంకటస్వామి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోనే ఈ విషయం బయటపడింది. కాంగ్రెస్(Congress) పార్టీ చెన్నూర్ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి ఆస్తుల విలువ రూ.606.67 కోట్లుకాగా, చరాస్తులు రూ.380.76 కోట్లు, స్థిరాస్తులు రూ.225.91 కోట్లు, దంపతులిద్దరి పేరిట ఉన్న అప్పు రూ.45.44 కోట్లు గా వివేక్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.

వివేక్ వద్ద సీఎం కేసీఆర్ రూ.1.06 కోట్ల అప్పు తీసుకున్నారట. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy)కి రూ.కోటిన్నర అప్పు ఇచ్చారట. ఇందుకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వెంకట స్వామి రూ.680 కోట్లతో తెలంగాణలోనే అత్యంత ధనిక రాజకీయ నేతగా ఉన్నారు.

Updated Date - 2023-11-12T16:25:04+05:30 IST