TS News: మహబూబాబాద్‌లో వీధి కుక్కల స్వైర విహారం

ABN , First Publish Date - 2023-01-21T10:27:44+05:30 IST

జిల్లాలోని నర్సింహులపేట మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి.

TS News: మహబూబాబాద్‌లో వీధి కుక్కల స్వైర విహారం

మహబూబాబాద్: జిల్లాలోని నర్సింహులపేట మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేయడంతో... కొమ్ము లింగయ్యకు చెందిన 8 గొర్రెలు మృతి చెందగా... 3 గొర్రెలకు గాయాలయ్యాయి. గతంలోనూ వీధి కుక్కల దాడిలో పదుల సంఖ్యలో గొర్రెలు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో ఆర్థికంగా చితికి పోతున్నామని గొర్రె కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-01-21T10:27:45+05:30 IST