Share News

COLLECTOR: పేద ఖైదీల కోసం కమిటీ ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Oct 07 , 2024 | 11:40 PM

పేద ఖైదీలకు సాధికార కమిటీ ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో 171 ఫిర్యాదులు స్వీకరించారు.

COLLECTOR: పేద ఖైదీల కోసం కమిటీ ఏర్పాటు చేయాలి
Collector TS Chetana receiving the complaints

పుట్టపర్తి, అక్టోబరు 7: పేద ఖైదీలకు సాధికార కమిటీ ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో 171 ఫిర్యాదులు స్వీకరించారు. పారదర్శకంగా ఫిర్యాదులను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ సూచించారు. అనంతరం పేదఖైదీలకు సాధికార కమిటీ ఏర్పాటుపై జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కేంద్రహోంశాఖ భారతప్రభుత్వం పేదఖైదీల మద్దతు కోసం పథకాన్ని రూపొందించిందని తద్వార ఆర్ధికసహాయం అందచేస్తారన్నారు. ఖైదీలపై విదించిన జరిమానా చెల్లించలేకపోవడం బెయిల్‌పై విడుదలయ్యే ఖర్చులను చెల్లించలేని పేద ఖైదీలకు కేంద్రప్రభుత్వమే ఆర్థికంగా సహాయం చేస్తుందన్నారు.

Updated Date - Oct 07 , 2024 | 11:40 PM