Home » Sri Satyasai
Paritala Sunitha Vs Jagan: జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ప్రకాష్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ను జగన్ చదువుతున్నారని విమర్శించారు. పరీక్షల్లో కాపీ కొట్టినట్టుగా పేపర్లు చూసి చదువుతున్నారని వ్యాఖ్యలు చేశారు. పాపిరెడ్డిపల్లిలో అనుకోకుండా ఒక సంఘటన జరిగిందని.. కానీ దాన్ని కొడవండ్లు, మారుణాయుధాలు అంటున్నారన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.బెంగళూరు నుంచి ప్రత్యేక హెలీకాఫ్టర్లో బయలుదేరి వస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Sunitha Comments On Jagan: చట్టం ఎవరికీ చుట్టం కాదని.. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అని ఎమ్మెల్యే పరిటాల సునీత స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై విచ్చలవిడిగా దాడులకు పాల్పడ్డారని.. అప్పుడు లేని ప్రేమ ఇప్పుడే బీసీలపై జగన్కు పుట్టుకొచ్చిందంటూ ధ్వజమెత్తారు.
పొట్ట చేతపట్టుకుని తమిళనాడు నుంచి వచ్చిన దంపతుల పట్ల ఓ వైసీపీ నేత దారుణంగా ప్రవర్తించాడు.
హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా సాగింది. టీడీపీ నేత ఎన్నిక అయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ ప్రారంభమైనప్పుడు నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. కౌన్సిలర్లు చేజారి పోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ క్యాంపు నుండి నేరుగా ఎమ్మెల్యే కార్యాలయంకు.. అక్కడ నుంచి మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చారు.
ఈనెల 13న కళాశాలలో నిర్వహించిన పరీక్షల్లో వెనుక ఉన్న విద్యార్థి ప్రేమ్సాయి పేపరులోకి తొంగి చూసినట్లు తెలుస్తోంది. తన పేపరులో ఎందుకు చూస్తున్నావని ప్రేమ్ సాయి ప్రశ్నించగా మాటామాటా పెరిగింది.
శ్రీసత్యసాయి జిల్లా, కదిరి మున్సిపాల్టీ పరిధిలోని సర్వే నంబర్లో ప్రభుత్వ భూమిని షామీర్ భాషా కబ్జా చేశాడంటూ మున్సిపల్ కమిషనర్ గత నెల 13న ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షామీర్ భాషాతోపాటు ఆర్ఐ మున్వర్ భాషా ఇతర వైసీపీ నేతలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కూలి పనులకు వెళ్తేగానీ పూటగడవని నిరుపేద దళిత కుటుంబం... పైగా టీడీపీ అంటే అభిమానం... ఇంకేముంది వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. దాడిచేసి విచక్షణారహితంగా చావబాదడమే కాక.. దీపావళి పండక్కి ఇంటికొచ్చిన యువకుడిని ‘కేసు వెనక్కు తీసుకోకుంటే.. మీ ఫ్యామిలీ మొత్తాన్నీ చంపేస్తాం’ అని బెదిరించాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేయించడంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు సమష్టి కృషి చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథ్రెడ్డి కోరారు.
జిల్లాలో ఐదు నెలలుగా చేపట్టిన ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని కలెక్టర్ చేతన అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు.