Share News

MLA SRAVANISREE హెచ్చెల్సీకి నీరు విడుదల చేయిస్తా: ఎమ్మెల్యే శ్రావణిశ్రీ

ABN , Publish Date - Sep 20 , 2024 | 12:15 AM

నియోజకవర్గంలో సాగుకోసం హెచఎల్‌సీకి నీటిని విడుదల చేయిచి రైతులకు దసరా పండుగ సంతోషా న్ని కలిగిస్తానని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పెర్కొన్నారు. ఆమె గురు వారం అనంతపురంలో జరిగిన ఐఏబీ సమావేశం తరువాత అమె విలేకరులతో మాట్లాడుతూ... శింగనమల నియోజకవర్గానికి ఈనెల 23వ తేదిన నీటిని విడుదల చేయునట్లు అధికారులు హామీ ఇచ్చారని తెలిపా రు.

MLA SRAVANISREE  హెచ్చెల్సీకి నీరు విడుదల చేయిస్తా: ఎమ్మెల్యే శ్రావణిశ్రీ
mla Bandaru SravaniSree

శింగనమల సెప్టెంబరు 19: నియోజకవర్గంలో సాగుకోసం హెచఎల్‌సీకి నీటిని విడుదల చేయిచి రైతులకు దసరా పండుగ సంతోషా న్ని కలిగిస్తానని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పెర్కొన్నారు. ఆమె గురు వారం అనంతపురంలో జరిగిన ఐఏబీ సమావేశం తరువాత అమె విలేకరులతో మాట్లాడుతూ... శింగనమల నియోజకవర్గానికి ఈనెల 23వ తేదిన నీటిని విడుదల చేయునట్లు అధికారులు హామీ ఇచ్చారని తెలిపా రు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని ఎవరూ ఆందోళన చెందాల్సి న అవసరం లేదన్నారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని 130 రోజులు నీటా సరఫరా ఉంటుదని తెలిపారు. గతంలో ఆనఅండ్‌ఆఫ్‌ పద్ధతి ఉండేదని, ఇప్పుడు అలాకాకుండా నేరుగా హెచఎల్‌సీకి నీటి సరఫరా ఒకే విధంగా ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని మిడ్‌పెన్నార్‌ దక్షిణ కాలువ పరిధిలో రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో పరిశీలించి 23 నుంచి హెచఎల్‌సీపీ నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్‌ అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 20 , 2024 | 12:15 AM