Share News

MLA SHRAVNISREE : కూటమితోనే ప్రజా సంక్షేమ పాలన

ABN , Publish Date - Sep 24 , 2024 | 12:11 AM

ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సాధ్యమని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మండల పరిధిలోని పెనకచెర్ల గ్రా మంలో సోమవారం నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమానికి ఎమ్మెల్యే, ఎంపీతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌శివుడు యాదవ్‌, నియోజకవర్గ టూమెన కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు ముఖ్య అధితులుగా హాజరయ్యారు

MLA SHRAVNISREE : కూటమితోనే ప్రజా సంక్షేమ పాలన
MLA Shravanishree speaking in the meeting, MP Ambika who participated

ఎంపీ అంబికా, ఎమ్మెల్యే శ్రావణిశ్రీ

గార్లదిన్నె, సెప్టెంబరు 23 : ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సాధ్యమని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మండల పరిధిలోని పెనకచెర్ల గ్రా మంలో సోమవారం నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమానికి ఎమ్మెల్యే, ఎంపీతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌శివుడు యాదవ్‌, నియోజకవర్గ టూమెన కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు ముఖ్య అధితులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ... కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల మన్నులను పొందుతు న్నామన్నారు. వైసీపీ పాలనతో ఆర్థికంగా వెనుక బడిన రాష్ట్రం అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని అ న్నారు. జగన పాలనలో కలియుగ ధైవమైన వెంకటేశ్వరస్వామి ప్రసాదా న్ని కూడా కల్తీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముంటి మడుగు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ విశాలాక్షి, సర్పంచు బచ్చలన్న, గేటుక్రిష్ణారెడ్డి, గుర్రం ఆదినారాయణ, ఎంపీటీసీ ధనుంజయ, నరసింహారెడ్డి, చితంబరప్ప, ఇల్లూరు రామాంజి, పుల్లన్న, వడ్డేవన్నూర్‌, సుంకన్న, చల్లానాగరాజు, రమణప్ప తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 24 , 2024 | 12:11 AM