Share News

DMHO MEETING: తల్లీబిడ్డ క్షేమమే ధ్యేయం: డీఎంహెచఓ

ABN , Publish Date - May 22 , 2024 | 11:54 PM

ఆసుపత్రికి వచ్చే ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి గర్భిణులకు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలందించి తల్లీబిడ్డను రక్షించడమే ధ్యేయంగా పనిచేయాలని జిల్లావైద్యాదికారి డాక్టర్‌ మంజువాణి సూచించారు. బుధవారం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.

DMHO MEETING: తల్లీబిడ్డ క్షేమమే ధ్యేయం: డీఎంహెచఓ
Dmho Speaking

పుట్టపర్తి రూరల్‌, మే 22: ఆసుపత్రికి వచ్చే ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి గర్భిణులకు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలందించి తల్లీబిడ్డను రక్షించడమే ధ్యేయంగా పనిచేయాలని జిల్లావైద్యాదికారి డాక్టర్‌ మంజువాణి సూచించారు. బుధవారం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైద్యసిబ్బంది ప్రతిఒక్కరూ తల్లీబిడ్డను కాపాడుకోవడానికే పనిచేస్తున్నామని గుర్తుంచుకోవాలన్నారు. అంతకుముందు జిల్లాలో జరిగిన మాతాశిశు మరణాలకు సంబంధించి డిసి్ట్రక్ట్‌ హైలెవల్‌ సబ్‌కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికరిఇ నాగేంద్రనాయక్‌, డిప్యూటీ డీఎంహెచఓ డాక్టర్‌ సెల్వియాసాల్మన, పీడియాట్రిషన డాక్టర్‌ జోవెల్‌వెస్లీ, గైనకాలజిస్టు డాక్టర్‌ శ్రీలత, డీపీహెచఓఎనఓ వీరమ్మ, ఐసీడీఎస్‌ సీడీపీఓ గాయత్రి, హెచఈ చంద్రానాయక్‌ ఇతర వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2024 | 11:54 PM