Share News

MLA DAGGUPATI : ‘నాడు - నేడు’ అంటే ఇదేనా..?

ABN , Publish Date - Oct 09 , 2024 | 12:00 AM

నాడు - నేడు అంటూ ఊదర గొట్టిన గత వైసీపీ ప్రభుత్వం పాలన ఎలా ఉందో చెప్పడానికి... నగరంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలే నిదర్శనమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ పేర్కొన్నారు. ‘మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం రెండో రోజు స్థానిక హౌ సింగ్‌ బోర్డులో పర్యటిం చారు.

MLA DAGGUPATI : ‘నాడు - నేడు’ అంటే ఇదేనా..?
MLA Daggupati is aware of people's problems

గత వైసీపీ పాలనపై ఎమ్మెల్యే దగ్గుపాటి మండిపాటు

హౌసింగ్‌ బోర్డులో ‘మీ ఇంటికి మీ ఎమ్మెల్యే’

అనంతపురం అర్బన, అక్టోబరు 8 : నాడు - నేడు అంటూ ఊదర గొట్టిన గత వైసీపీ ప్రభుత్వం పాలన ఎలా ఉందో చెప్పడానికి... నగరంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలే నిదర్శనమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ పేర్కొన్నారు. ‘మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం రెండో రోజు స్థానిక హౌ సింగ్‌ బోర్డులో పర్యటిం చారు. స్థానికంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తె లుసుకున్నారు. కొందరు పింఛన్లు రావడం లేదని తెలుపగా, మరికొందరు తాగునీరు, డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే హమాలీ కాలనీలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలను చూసి ఎమ్మె ల్యే తీవ్రంగా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో నాడు - నేడు పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, అయితే ఇలాంటి శిథి లావస్థ పాఠశాలపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ నాయకులు రాయల్‌ మురళి, సరిపూటి రమణ, సుధాకర్‌ యాదవ్‌, తమ్మినేని వేణుగోపాల్‌, గుర్రం నాగభూషణం, లక్ష్మీనరసింహ, నారాయణస్వామి యాదవ్‌, గంగారామ్‌, ఫిరోజ్‌ అహ్మద్‌, కాశీ విశ్వనాథ్‌, వెంకటేశ్వరరెడ్డి, శ్రీ లక్ష్మీ, సరిపూటి శ్రీకాంత తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 09 , 2024 | 12:00 AM