Share News

MLA PARITALA SUNITHA: జగనరెడ్డీ.. అధికారం పోయినా కుట్రలు మానవా..?

ABN , Publish Date - Aug 07 , 2024 | 11:39 PM

జగనరెడ్డీ... అధికారం పోయినా నీ కుట్రలు మానవా..? అంటూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం అనంతపురం నగరంలోని నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

MLA PARITALA SUNITHA: జగనరెడ్డీ.. అధికారం పోయినా కుట్రలు మానవా..?
Speaking MLA Paritala Sunitha

అనంతపురం అర్బన, ఆగస్టు 7: జగనరెడ్డీ... అధికారం పోయినా నీ కుట్రలు మానవా..? అంటూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం అనంతపురం నగరంలోని నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జగనరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కుళ్లు, కుతంత్రాలతో పాలన సాగిందని, ఇప్పుడు అధికారం పోయినా పైశాచిక చర్యలు మానడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగడం జగనకు ఇష్టం లేదన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని విమర్శలు చేయడంతోపాటు ఎవరు ఎక్కడ వ్యక్తిగతంగా దాడులు చేసుకున్నా వాటిని టీడీపీకి ఆపాదిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కుట్రలు పన్నుతున్నారన్నారు. 30 రోజుల్లో 36 మంది వైసీపీ నాయకులు హత్యకు గురయ్యారని ఢిల్లీలో ప్రచారం చేశారని, వారి వివరాలు ఇవ్వమంటే సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారన్నారు. నీ హయాంలో ఎంత దౌర్జన్యకాండ జరిగిందో చెప్పేందుకు రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన సంఘటనలే చాలన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా అలాంటి సంఘటనలు జరిగాయా అని ప్రశ్నించారు. ఐదేళ్లుగా జరిగిన వ్యవస్థల విధ్వంసాన్ని సీఎం చంద్రబాబు ఇప్పుడిప్పుడే గాడిలోపెడుతున్నారని, శాంతిభద్రతలను పరిరక్షించడం ద్వారా రాష్ర్టానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్షించాలని ఆయన తపిస్తున్నారన్నారు. జగన చేస్తున్న కుట్రలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Updated Date - Aug 07 , 2024 | 11:39 PM