Share News

MLA SHRAVANISREE : గురుకులాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ABN , Publish Date - Sep 28 , 2024 | 12:14 AM

మండలపరిధిలోని రోటరీపు రం వద్ద ఉన్న అంబేడ్కర్‌ గురుకల బాలికల పాఠశాలను ఎమ్మెల్యే బండా రు శ్రావణీశ్రీ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిని పరిశీ లించగా ఎండిపోయిన ఆకుకూరలు, నాసిరకం, కూరగాయలు, చిన్న సైజు కోడిగుడ్లు ఉండడంతో... ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటితో ఆహారం వండి పెడితే పిల్లల ఆరోగ్యం ఏం కావాలి? అని ఆగ్రహించారు.

MLA SHRAVANISREE : గురుకులాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
MLA Shravanishree asking the children about the meal

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిబ్బందిపై ఆగ్రహం

బుక్కరాయసముద్రం, సెప్టెంబరు27: మండలపరిధిలోని రోటరీపు రం వద్ద ఉన్న అంబేడ్కర్‌ గురుకల బాలికల పాఠశాలను ఎమ్మెల్యే బండా రు శ్రావణీశ్రీ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిని పరిశీ లించగా ఎండిపోయిన ఆకుకూరలు, నాసిరకం, కూరగాయలు, చిన్న సైజు కోడిగుడ్లు ఉండడంతో... ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటితో ఆహారం వండి పెడితే పిల్లల ఆరోగ్యం ఏం కావాలి? అని ఆగ్రహించారు. అలాగే వసతి గృహంలో టాయిలెట్స్‌కు తలుపులు, చిలుకు లు లేకపోవడం, స్నానాల గదిలో గీజర్‌ పనిచేయకపోవడంతో సిబ్బందిని మందలించారు. అనంతరం పిల్లలుతో కలిసి భోజనం చేశారు. గురుకల పాఠశాలలో సౌకర్యాలపై ఎమ్మెల్యే అసంతృప్తికి వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు, గడ్డి లేకుండా శుభ్రం చేయాలని ఆదేశించా రు. అలాగే కాలం తీరిన మందులను గమనించి ఏఎనఎం మాధవీలతను మందలించారు. దీంతో ఆమె కుప్పకూలిపోవడంతో ఎమ్మెల్యే వాహనం లోనే అనంతపురం సర్వజన అస్పుత్రికి తరలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ జిల్లా నేత పసుపుల శ్రీరామిరెడ్డి, బోయ ఆది, ఓబులపతి, పొడరాళ్ల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 28 , 2024 | 12:14 AM