MP, MLA: నారాయణపురాన్ని కార్పొరేషనలో విలీనం చేస్తాం
ABN , Publish Date - Jul 18 , 2024 | 11:53 PM
మండలంలోని నారాయణపురం పంచాయతీని కార్పొరేషనలో విలీనం చేస్తామని ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. గురువారం మండలంలోని ఎ.నారాయణపురం పంచాయతీ ఏఎ్సఆర్ నగర్లో పీర్ల మకాన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతపురం రూరల్, జూలై 18: మండలంలోని నారాయణపురం పంచాయతీని కార్పొరేషనలో విలీనం చేస్తామని ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. గురువారం మండలంలోని ఎ.నారాయణపురం పంచాయతీ ఏఎ్సఆర్ నగర్లో పీర్ల మకాన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యే జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నారాయణపురం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మెజార్టీ తనకు ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఆదినారాయణ, రాయల్ మురళి, బీసీసెల్ నాయకులు జోగి రాజేంద్ర, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ యాదవ్, రాష్ట్ర నాయకులు దండు శ్రీనివాసులు, ఈశ్వర్, రమణ, లాల్స్వామి, అనిల్, సుధాకర్, వెంకటేష్ పాల్గొన్నారు.