Share News

MLA SHRAVANISREE : సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం

ABN , Publish Date - Sep 25 , 2024 | 12:20 AM

రాష్ట్రాభివృద్ధి, అన్ని వర్గాల ప్రజలు సం క్షేమమే ఽధ్వేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మండలంలోని లోలూరులో మంగళ వారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు.

MLA SHRAVANISREE : సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం
MLA Bandaru Shravanishree who is contesting in Lolur

ఎమ్మెల్యే శ్రావణిశ్రీ

శింగనమల, సెప్టెంబరు24: రాష్ట్రాభివృద్ధి, అన్ని వర్గాల ప్రజలు సం క్షేమమే ఽధ్వేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మండలంలోని లోలూరులో మంగళ వారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. కూటమి వంద రోజుల పాలనపై ఇంటింటా తిరుగు తూ కరపత్రాలు పంపిణి చేశారు. లోలూరులో గోకులం షెడ్‌, ఆకులేడు గ్రామంలో వాటర్‌షెడ్‌ కింద ఫారం ఫండ్‌ పనులకు భూమి పూజ చేశారు. అంగన్వాడీలు ఏర్పాటు చేసిన పౌష్టికహారం స్టాల్‌ను పరిశీలించారు. అరు పంచాయతీలకు ఉచితంగా వచ్చిన ట్రాక్టర్లను సర్పంచలకు అందజేశారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్‌ బ్రహ్మయ్య ఎంపీడీఓ నిర్మలకుమారి సీడిపీఓ ఉమాశంకరమ్మ ఏఓ అన్వేష్‌ ముమార్‌, టీడీపీ నాయకులు గుత్తా ఆదినారాయణ, దండుశ్రీనివాసులు, డేగలకృష్ణమూర్తి, మారుతినాయుడు, ఈశ్వర్‌రెడ్డి, షాలిని, చితంబరిదొర, చిదానందనాయుడు, అనంతచౌదరి, కొండయ్య, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 25 , 2024 | 12:20 AM