Share News

MLA DAGGUPATI : గత పాలకుల తప్పులు నగర ప్రజలకు శాపం

ABN , Publish Date - Oct 11 , 2024 | 12:10 AM

గత వెసీపీ హయాంలో పా లకులు చేసిన తప్పులు నగర ప్రజలకు శాపాలుగా మారాయని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక అశోక్‌ నగర్‌లో ఎమ్మెల్యే పర్య టించారు. స్థానికంగా ఇంటింటికీ వెళ్లి సమస్యలపై ప్రజలతో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అశోక్‌నగర్‌ బ్రిడ్జి ఎత్తులో కట్టాలని గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ రోడ్డుకు సమానంగా కట్టడంతో డ్రైనేజీ సమస్య ఎక్కువైందన్నారు.

MLA DAGGUPATI : గత పాలకుల తప్పులు నగర ప్రజలకు శాపం
MLA Daggupati Prasad inspecting Ashok Nagar Bridge

ఎమ్మెల్యే దగ్గుపాటి ఫ అశోక్‌ నగర్‌లో పర్యటన

అనంతపురం అర్బన, అక్టోబరు 10: గత వెసీపీ హయాంలో పా లకులు చేసిన తప్పులు నగర ప్రజలకు శాపాలుగా మారాయని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక అశోక్‌ నగర్‌లో ఎమ్మెల్యే పర్య టించారు. స్థానికంగా ఇంటింటికీ వెళ్లి సమస్యలపై ప్రజలతో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అశోక్‌నగర్‌ బ్రిడ్జి ఎత్తులో కట్టాలని గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ రోడ్డుకు సమానంగా కట్టడంతో డ్రైనేజీ సమస్య ఎక్కువైందన్నారు. బ్రిడ్జి వద్ద రోడ్డు కూడా వే యలేదన్నారు. త్వరలో రోడ్డు వేయడంతోపాటు డ్రైనేజీ సమస్యను పరిష్క రించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇండోర్‌ స్టేడియంలో జనరేటర్‌, సామగ్రి మాయంపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో ఒక అధికారి పాత్రపై ఆరోపణలు రావడంతో దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఎక్కువగా డ్రైనేజీ స మస్యలే చెబుతున్నారని, దీనికి అండర్‌ డ్రైనేజీ ఏర్పాటే శాశ్వత పరిష్కా రమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుగ్గయ్య చౌదరి, రాయల్‌ మురళీ, సరిపూటి రమణ, సుధాకర్‌ యాదవ్‌, రామాంజినేయులు, రాజా రావు, కృష్ణకుమార్‌, నారాయణస్వామి యాదవ్‌, పీఎం లక్ష్మీప్రసాద్‌, ఫిరోజ్‌ అహ్మద్‌, రంగాచారి, వెంకటేశ్వరరెడ్డి, మనోహర్‌, మున్వర్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 11 , 2024 | 12:10 AM