Share News

WOMENS CRICIKET: మహిళా క్రికెట్‌ పోటీల్లో పలుజట్ల విజయం

ABN , Publish Date - Jul 17 , 2024 | 11:54 PM

మహిళా క్రికెట్‌ పోటీల్లో పలు జట్లు విజయం సాధించాయి. బుధవారం స్థానిక అనంత క్రీడాగ్రామంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన, జిల్లా క్రికెట్‌ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సీనియర్‌ మహిళా అంతర్‌ జోనల్‌ క్రికెట్‌ పోటీలు నిర్వహించారు.

WOMENS CRICIKET: మహిళా క్రికెట్‌ పోటీల్లో పలుజట్ల విజయం
Maccha Ramalinga Reddy with cricketers

అనంతపురం క్లాక్‌టవర్‌, జూలై 17: మహిళా క్రికెట్‌ పోటీల్లో పలు జట్లు విజయం సాధించాయి. బుధవారం స్థానిక అనంత క్రీడాగ్రామంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన, జిల్లా క్రికెట్‌ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సీనియర్‌ మహిళా అంతర్‌ జోనల్‌ క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. చిత్తూరు, సౌతజోన జట్లు తలపడ్డాయి. చిత్తూరు జట్టు 30.5 ఓవర్లలో 70పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్పలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతజోన 25.4 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మరో మ్యాచలో నార్త్‌జోన, విశాఖపట్నం జట్లు తలపడ్డాయి. నార్త్‌జోన జట్టు 9 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన విశాఖపట్నం జట్టు 43.2 ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 215 పరుగులు సాధించి గెలుపొందింది. హర్షిత 81 పరుగులు చేసింది. సెంట్రల్‌జోన, కృష్ణ జట్లు మధ్య జరగగా సెంట్రల్‌ జోన నిర్ణీత 50ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 250పరుగులు చేసింది. హెన్రిట్టా 97పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన కృష్ణా 22.4ఓవర్లలో 209పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. సెంట్రల్‌ జోన 41పరుగులు తేడాతో విజయం సాధించింది. కీప్‌ ఆంధ్రా ప్రైడ్‌ మచ్చా రామలింగారెడ్డి క్రీడాకారిణులతో మాట్లాడారు. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన అసిస్టెంట్‌ మేనేజర్‌ మాధురి, కోచలు విక్రమ్‌వర్మ, రమాదేవి, సెలెక్షన కమిటీ చైర్మన జీవీఎస్‌ ప్రసాద్‌, తులసిరామలక్ష్మి, అనిత, జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి మధు ఆచారి పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2024 | 11:54 PM