Share News

ARYA VYSYAS: ఆర్యవైశ్యుల సంక్షేమానికి పెద్దపీట

ABN , Publish Date - Aug 26 , 2024 | 12:26 AM

ఆర్యవైశ్యుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ అన్నారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఎమ్మెల్యేతోపాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణలకు అభినందన సభ నిర్వహించి శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.

ARYA VYSYAS: ఆర్యవైశ్యుల సంక్షేమానికి పెద్దపీట
Arya Vaishyas honoring MP and MLA

ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌

అనంతపురం కల్చరల్‌, ఆగస్టు 25: ఆర్యవైశ్యుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ అన్నారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఎమ్మెల్యేతోపాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణలకు అభినందన సభ నిర్వహించి శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తన గెలుపులో ఆర్యవైశ్యులు ఎంతో కీలకపాత్ర పోషించారన్నారు. ఆర్యవైశ్య కమ్యూనిటీ హాల్‌ నిర్మాణంకోసం జిల్లాలోని ఆర్యవైశ్యులు స్థలం అడిగారని, వారి కోర్కెను ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు. టీడీపీ పార్లమెంట్‌ మీడియా కో-ఆర్డినేటర్‌ కూచి హరి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ, తెలుగు యువత నాయకుడు లింగారెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకుడు తాజుద్దీన, ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షుడు కలవల రామ్‌కుమార్‌, అధ్యక్షుడు సిరిగుప్ప వెంకటేష్‌, కొత్తూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోపా మచ్చా నరసింహులు, పాతూరు అధ్యక్షుడు పిన్ని నాగరత్నం, కృష్ణం రఘు, తాటి మధు, టంగుటూరి నాగభూషణం, సత్రసాల మంజునాథ్‌, వంకదారు వెంకటకృష్ణ, భూమా బాల పాల్గొన్నారు.

రామకృష్ణుల విశ్వసేవా మందిరానికి సహకరిస్తాం: రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో హెచ్చెల్సీ కాలనీలో నిర్మిస్తున్న రామకృష్ణుల విశ్వ సేవా మందిరానికి తనవంతు సహకారమందిస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ అన్నారు. ఆదివారం హెచ్చెల్సీ కాలనీలో నిర్వహించిన రామకృష్ణుల విశ్వ సేవా మందిరం శంకుస్థాపన కార్యాక్రమానికి ఎమ్మెల్యేతోపాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ హాజరై పూజలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర నాయకుడు గంగారామ్‌, రామకృష్ణ సేవాసమితి అధ్యక్షుడు శ్రీకృష్ణశశి, వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీధరమూర్తి, వేణుగోపాల్‌, కార్యదర్శి వేదాద్రి ప్రవీణ్‌, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


విశ్వాన్ని నడిపిస్తున్నది శ్రీకృష్ణుడే: విశ్వాన్ని నడిపిస్తున్నది శ్రీకృష్ణుడేనని, ఆయన సూచించిన మార్గంలో ప్రతిఒక్కరూ నడుద్దామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చెరువుకట్ట వద్ద ఉన్న బ్రహ్మకుమారీల కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పీటీసీ మైదానం అభివృద్ధికి కృషి

అనంత పురం అర్బన: పీటీసీ మైదానం అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు. ఆదివారం నగర కమిషనర్‌ మూర్తి, పలువురు టీడీపీ నాయకులతో కలిసి పీటీసీలో ఎమ్మెల్యే మార్నింగ్‌ వాక్‌ చేశారు. కొద్ది సేపు అక్కడి వారితో క్రికెట్‌ ఆడారు. వాకర్స్‌ అసోసియేషన నాయకులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రాయల్‌ మురళీ, గంగారామ్‌, కూచి హరి పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2024 | 12:26 AM