Share News

MLA SUNITHA: అభివృద్ధి పనుల్లో తేడా రాకూడదు

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:10 AM

రాప్తాడు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఎక్కడా తేడా రాకూడదని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. సోమవారం అనంతపురంలోని ఆమె నివాసంలో నియోజకవర్గంలోని ముఖ్యనాయకులతో పరిటాల సునీత సమావేశమయ్యారు.

MLA SUNITHA: అభివృద్ధి పనుల్లో తేడా రాకూడదు
MLA Paritala Sunitha met with the leaders

అనంతపురం అర్బన, సెప్టెంబరు 9: రాప్తాడు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఎక్కడా తేడా రాకూడదని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. సోమవారం అనంతపురంలోని ఆమె నివాసంలో నియోజకవర్గంలోని ముఖ్యనాయకులతో పరిటాల సునీత సమావేశమయ్యారు. గ్రామాల్లో నిర్మించబోయే సీసీ రోడ్లు, ఇతర పనులు, రేషన పంపిణీ, పంటల సాగు తదితర అంశాలపై ఆమె ఆరా తీశారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. ప్రస్తుతం పొలం పిలుస్తోంది కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో రైతులు ఎలాంటి పంటలు సాగు చేస్తున్నారు? ఈ పంట నమోదుపై దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ రేషన బియ్యం అందాలన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో టీడీపీని గెలిపించారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 12:10 AM