Share News

Krishastami : వసుదేవ తనయ.. వందనం!

ABN , Publish Date - Aug 27 , 2024 | 12:36 AM

శీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కృష్ణ మందిరాలతో పాటు జిల్లాకేంద్రంలోని ఇస్కాన్‌ మందిరాలకు ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. అనంతపురం సివారులోని ఇస్కాన్‌ మందిరంలో ఉదయం విశ్వశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, సాయంత్రం ఉట్టికొట్టే ఉత్సవం, అనంతరం రాధా పార్థ సారఽథులకు విశేష పూజలు నిర్వహించారు. రాత్రికి ...

Krishastami : వసుదేవ తనయ.. వందనం!
Procession of idols in temple

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

భక్తులతో కిటకిటలాడిన ఇస్కాన్‌ మందిరం

శీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కృష్ణ మందిరాలతో పాటు జిల్లాకేంద్రంలోని ఇస్కాన్‌ మందిరాలకు ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. అనంతపురం సివారులోని ఇస్కాన్‌ మందిరంలో ఉదయం విశ్వశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, సాయంత్రం ఉట్టికొట్టే ఉత్సవం, అనంతరం రాధా పార్థ సారఽథులకు విశేష పూజలు నిర్వహించారు. రాత్రికి


ఆలయం వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తాత్కాలిక కొలనులో కన్నయ్యకు తెప్పోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయంలో మూల మూర్తులకు మహాభిషేకం అనంతరం పుష్పాభిషేకం గావించారు. పలు ప్రాంతాల్లో తమ చిన్నారులకు చిన్నారి కృష్ణుడు, గోపెమ్మల వేషధారణ చేయించి తల్లిదండ్రులు మురిసి పోయారు.

- అనంతపురం కల్చరల్‌


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 27 , 2024 | 12:36 AM