Share News

MLA : క్రైస్తవులకు అండగా ఉంటాం

ABN , Publish Date - Oct 15 , 2024 | 12:16 AM

క్రైస్తవులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. జీసెస్‌ నగర్‌లోని ఫెయిత చర్చ్‌లో సోమవారం జిల్లా పాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. అసోసియేషన అధ్యక్షుడు నాగరాజు అధ్యక్ష తన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యప్రసంగీకులుగా పాస్టర్‌ విజయ్‌కు మార్‌, ముఖ్యఅథితిగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ హాజరయ్యారు.

MLA : క్రైస్తవులకు అండగా ఉంటాం
MLA Daggupati handing over the financial assistance check to the pastors

ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌

అనంతపురంరూరల్‌/ కల్చరల్‌, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): క్రైస్తవులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. జీసెస్‌ నగర్‌లోని ఫెయిత చర్చ్‌లో సోమవారం జిల్లా పాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. అసోసియేషన అధ్యక్షుడు నాగరాజు అధ్యక్ష తన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యప్రసంగీకులుగా పాస్టర్‌ విజయ్‌కు మార్‌, ముఖ్యఅథితిగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రస్తుతం క్రిస్టియన కార్పొరేషన ద్వారా ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పాస్టర్లకు గత మూడు నెలలుగా గౌరవ వేతనం అందడం లేదని, వారికి వచ్చే నెలలో అందజేస్తామన్నారు. క్రిస్టియన్ల సమస్యల పరిష్కారానికి తాను వ్యక్తిగతంగా కృషి చేస్తానన్నారు. ఆయన చేతుల మీదుగా 21మంది పాస్టర్లకు రూ. వెయ్యి చొప్పున ఆర్థిక సాయం అందించారు. టీడీపీ రాష్ట్ర నాయకుడు కొండవీటి సుధాకర్‌నాయుడు, పాస్టర్‌ విజయ్‌కుమార్‌, క్రిస్టియన సెల్‌ నాయకులు ఈటె స్వామిదాస్‌, పాస్టర్‌ నెహమ్యా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అల్లావలి ఉరుసు ఉత్సవాల పోస్టర్ల విడుదల

అనంతపురం అర్బన : కర్నూలు జిల్లా ఆలూరు సమీపంలోని గట్టుమల్ల య్య కొండ వద్ద వెలసిన సయ్యద్‌ షా అల్లావలి, అంగార్‌ వలి సాహెబ్‌ ఉరుసు ఉత్సవాలకు ప్రజలు తరలిరావాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఉరుసు ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 15 , 2024 | 12:16 AM