Share News

MLA SHRAVANISREE : నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

ABN , Publish Date - Sep 27 , 2024 | 12:25 AM

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వెనుకబడిన ని యోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని జనచైతన్యకాలనీలో గురువారం ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హజరయ్యారు. తొలుత జనచైతన్య కాలనీలో సీసీ రోడ్లు నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు.

MLA SHRAVANISREE : నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
MLA Shravanishree unveiling the plaque in Jana Chaitanya Colony

ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ

బుక్కరాయసముద్రం: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వెనుకబడిన ని యోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని జనచైతన్యకాలనీలో గురువారం ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హజరయ్యారు. తొలుత జనచైతన్య కాలనీలో సీసీ రోడ్లు నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన, భవిష్యత్తులో చేపట్టే సంక్షేమ పథకాలను వివరించారు. అనంతర సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాధాన్యతక్రమంలో రోడ్లు నిర్మాణం చేపడు తున్నట్లు తెలిపారు. కూటమి పాలన ప్రజా రంజకంగా సాగుతోందన్నారు. మాట ఇచ్చిన విధంగా నియోజకవర్గంలో సాగునీరు ఇచ్చామన్నారు. త్వరలోనే తాగునీటి శాశ్వత సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాఽధ్యక్షుడు పసుపుల హనుమంతరెడ్డి, నాయకులు పొడరాళ్ల రవీంద్ర, మల్లిఖార్జునరెడ్డి, సోమశేఖర్‌, ఓబులపతి, వలి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 27 , 2024 | 12:25 AM