Share News

Anathapuram : వర్సిటీల్లో రాజీనామా బాట

ABN , Publish Date - Jun 28 , 2024 | 06:16 AM

అనంతపురం జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు.

Anathapuram : వర్సిటీల్లో రాజీనామా బాట

అనంతపురం సెంట్రల్‌, జూన్‌ 27: అనంతపురం జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి గురువారం రాజీనామా లేఖను పంపారు.

విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటి సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ అయిన శ్రీనివాసరావును జనవరి 17న అప్పటి ప్రభుత్వం వీసీగా నియమించింది. జేఎన్‌టీయూఏ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ శశిధర్‌ కూడా తన పదవికి రాజీనామా చేశారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వీసీ హుస్సేన్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ ఎంవీ లక్ష్మయ్య కూడా రాజీనామా చేసినట్టు వర్సిటీ వర్గాలు తెలిపాయి. అధికారికంగా ప్రకటించలేదు.

Updated Date - Jun 28 , 2024 | 06:16 AM