Share News

AP News: టీడీపీ రైతు సంఘం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం

ABN , Publish Date - Feb 20 , 2024 | 06:17 PM

ఏపీ తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కత్తితో విచక్షణా రహితంగా పొడిచిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.

AP News: టీడీపీ రైతు సంఘం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం

ఏపీ తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కత్తితో విచక్షణా రహితంగా పొడిచిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే అప్రమత్తమై చికిత్స కోసం ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు ఆయనను ఐసీయూలో తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. కత్తిపోట్లు తీవ్రంగా గాయపరిచాయని చెప్పారు.

ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో మాట్లాడి మర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఘటనతో ప్రశాంతంగా ఉండే ఒంగోలు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 20 , 2024 | 06:17 PM