Share News

Bhuvaneshwari: రేపల్లెలో ‘నిజం గెలవాలి’... కాసేపట్లో చేరుకోనున్న భువనేశ్వరి

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:38 PM

Andhrapradesh: ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితమే భువనేశ్వరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

Bhuvaneshwari: రేపల్లెలో ‘నిజం గెలవాలి’... కాసేపట్లో చేరుకోనున్న భువనేశ్వరి

అమరావతి, జనవరి 30: ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితమే భువనేశ్వరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. భువనేశ్వరికి మాజీ మంత్రి దేవినేని ఉమ (Former Minister Devineni Uma), ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శాలువాలు, పుష్పగుచ్చాలతో నాయకులు సత్కరించారు. రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా భువనేశ్వరి పర్యటించనున్నారు. మరికాసేపట్లో రేపల్లె నియోజకవర్గానికి భువనేశ్వరి చేరుకోనున్నారు. ఈ క్రమంలో చెరుకుపల్లి మండలం, చెరుకుపల్లి గ్రామంలో కార్యకర్త కోట వెంకటేశ్వరరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శిస్తారు.

కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్థాపానికి గురై చనిపోయిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పర్యటించిన భువనేశ్వరి.. బాధితులను పరామర్శిస్తూ.. ఆర్థిక సహాయం అందజేస్తూ.. టీడీపీ అండగా ఉంటుందంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 30 , 2024 | 12:38 PM