Share News

Chandrababu naidu: అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొన్న చంద్రబాబు

ABN , Publish Date - Jan 22 , 2024 | 11:40 AM

అయోధ్య రామ మందిర్ రాంలాలా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ క్రమంలోనే అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

Chandrababu naidu: అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొన్న చంద్రబాబు

అయోధ్య రామ మందిర్ రాంలాలా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఇప్పటికే ఈ గ్రాండ్ వేడుకను చూసేందుకు భక్తులతోపాటు పలువురు ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలోనే అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చంద్రబాబు వెంట శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ప్రాణప్రతిష్ఠ'ముహూర్తం' మధ్యాహ్నం 12.29.03 నుంచి 12.30.35 వరకు కొనసాగుతుంది. ఇది కేవలం 84 సెకన్ల పాటు మాత్రమే ఉంటుంది.


అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అయోధ్యకు నిన్న రాత్రి చేరుకున్నారు. రాత్రి అక్కడ బస చేసిన అనంతరం ఈరోజు జరిగే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులతోపాటు సినీ సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నారు.

Updated Date - Jan 22 , 2024 | 11:40 AM