Share News

Nara Bhuvaneshwari: ఏపీకి పరిశ్రమలను తీసుకురావడానికి కష్టపడ్డ చంద్రబాబు

ABN , Publish Date - Mar 07 , 2024 | 09:40 PM

నిజం గెలవాలి ద్వారా తాను ప్రజల ముందుకు వచ్చానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneshwari) అన్నారు. గురువారం నాడు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ... విభజన తర్వాత పరిశ్రమలను తీసుకు రావడానికి చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని తెలిపారు.

Nara Bhuvaneshwari: ఏపీకి పరిశ్రమలను తీసుకురావడానికి కష్టపడ్డ చంద్రబాబు
Nara Bhuvaneshwari

కర్నూలు: నిజం గెలవాలి ద్వారా తాను ప్రజల ముందుకు వచ్చానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneshwari) అన్నారు. గురువారం నాడు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ... విభజన తర్వాత పరిశ్రమలను తీసుకు రావడానికి చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ఆయన తెచ్చిన పరిశ్రమలను బెదిరించి మన రాష్ట్రం విడిచి వెళ్లేలా సీఎం జగన్ చేశారని మండిపడ్డారు.కియా, అమరరాజా లాంటి పరిశ్రమలను బెదిరించి భయబ్రాంతులకు గురి చేసి పక్క రాష్ట్రాలకు పారిపోయెలా చేశారని ధ్వజమెత్తారు.

గంజాయి శాండ్‌ను వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని తెలిపారు. వైసీపీ నేతల అవినీతిని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలను దారుణంగా చంపేశారని.. వారి కుటుంబాలను చిత్ర హింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల డబ్బులకు ఆశ పడకుండా..మీ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించి ..రానున్న కురుక్షేత్ర యుద్ధంలో ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. వైసీపీ నేతలు అరాచకాలు,దాడులు చేస్తారని మండిపడ్డారు. అన్నింటినీ ఎదుర్కొని పోరాటం చేయాలని అప్పుడే మీరు ఎదురు చూసే రాష్ట్రం సాకారం అవుతుందని తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 09:40 PM