Share News

Tirupati: ఏబీఎన్ చొరవ.. క్యాన్సర్ రోగి చివరి కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Oct 05 , 2024 | 12:45 PM

ఏబీఎన్ చొరవతో చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడి చివరి కోరిక తీరిపోయింది. తిరుపతికి చెందిన క్యాన్సర్ బాధితుడు సురేంద్రబాబు (32) తనకో కోరిక ఉందని ఏబీఎన్‌ను ఆశ్రయించాడు. సీఎం చంద్రబాబుని కలిసి మాట్లాడాలని తాపత్రయపడ్డాడు.

Tirupati: ఏబీఎన్ చొరవ.. క్యాన్సర్ రోగి చివరి కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు

తిరుపతి: ఏబీఎన్ చొరవతో చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడి చివరి కోరిక తీరిపోయింది. తిరుపతికి చెందిన క్యాన్సర్ బాధితుడు సురేంద్రబాబు (32) తనకో కోరిక ఉందని ఏబీఎన్‌ను ఆశ్రయించాడు. సీఎం చంద్రబాబుని కలిసి మాట్లాడాలని తాపత్రయపడ్డాడు. ఆయనతో కలిసి ఫొటో తీసుకుని మురిసిపోవాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బాధితుడి చివరి కోరిక నెరవేర్చడానికి ముందుకొచ్చింది. ఇందుకోసం సీఎం చంద్రబాబు వ్యక్తిగత సిబ్బందికి సమాచారం అందించింది. వారి ద్వారా విషయం తెలుసుకున్న చంద్రబాబు బాధితుడిని పరామర్శించాలని నిర్ణయించారు.

అనంతరం తిరుపతిలో నివసిస్తున్న బాధితుడి దగ్గరికి వెళ్లి బాబు కాసేపు ముచ్చటించారు. అనంతరం ఇరువురు కలిసి ఫొటో దిగారు. తన కల నెరవేరడంతో సురేంద్రబాబు ఉబ్బితబ్బిబ్బయ్యారు. బాబు తనను కలవడానికి రావడంపై హర్షం వ్యక్తం చేశాడు. అందుకు సాయపడిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు తెలిపాడు.


తన జీవిత చరమాంకంలో ఇది మరుపురాని ఘటన అని బాధితుడు భావోద్వేగానికి లోనయ్యాడు. అభిమాని కోరిక తీర్చిన సీఎం చంద్రబాబుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే సురేంద్రబాబుకు క్యాన్సర్ మహమ్మారి నాలుగో దశలో ఉందని వైద్యులు తెలిపారు. దీంతో అతడు బతికే అవకాశం లేదని చెప్పారు. కాపాడటం అసాధ్యమన్నారు.

Hyderabad: రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో..

For Latest news and National News click here

Updated Date - Oct 05 , 2024 | 12:48 PM