Share News

AP Elections 2024: వారిని నా జీవితంలో మర్చిపోలేను.. సీఎం రమేష్ భావోద్వేగ ప్రకటన

ABN , Publish Date - May 15 , 2024 | 07:58 PM

ఎన్డీయే కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ (CM Ramesh) భావోద్వేగ ప్రకటన చేశారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనకాపల్లి ప్రజలు తనపట్ల చూపించిన ప్రేమాభిమానాలను తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.

 AP Elections 2024: వారిని నా జీవితంలో మర్చిపోలేను.. సీఎం రమేష్ భావోద్వేగ ప్రకటన
CM Ramesh

అనకాపల్లి జిల్లా: ఎన్డీయే కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ (CM Ramesh) భావోద్వేగ ప్రకటన చేశారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనకాపల్లి ప్రజలు తనపట్ల చూపించిన ప్రేమాభిమానాలను తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. తన విజయానికి రాత్రి, పగలూ తేడా లేకుండా కష్ట పడి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో కూటమి అభ్యర్థుల విజయానికి అహోరాత్రులూ ఎంతో మంది తీవ్రంగా శ్రమించారని చెప్పుకొచ్చారు.


కూటమి అభ్యర్థుల విజయానికి పనిచేసిన మేధావులు, డాక్టర్లు, లాయర్లు, వివిధ సంఘాలు, అసోసియేషన్లు, శ్రేయోభిలాషులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా అనకాపల్లి ప్రజలు తనను తమ ఇంట్లో మనిషిలా ఆదరించారని చెప్పారు. తాను ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని సీఎం రమేష్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

AP Politics: టియర్ గ్యాస్‌ ఎఫెక్ట్.. జేసీకి అస్వస్థత

AP Elections: అంతలోనే మాట మారింది..?

Updated Date - May 15 , 2024 | 08:12 PM