Share News

AP Election Counting 2024: ఏపీలో ప్రారంభమైన కౌంటింగ్.. ముందుగా పోస్టల్ బ్యాలెట్

ABN , Publish Date - Jun 04 , 2024 | 08:03 AM

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. 5.15 లక్షల పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఉద్యోగులు, అత్యవసర సర్వీసు సిబ్బంది 4,61,945 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు 26,721 మంది ఉన్నారు.

AP Election Counting 2024: ఏపీలో ప్రారంభమైన కౌంటింగ్.. ముందుగా పోస్టల్ బ్యాలెట్

లైవ్ అప్‌డేట్స్ కోసం..

అమరావతి: ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. 5.15 లక్షల పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఉద్యోగులు, అత్యవసర సర్వీసు సిబ్బంది 4,61,945 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు 26,721 మంది ఉన్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు 26,473 మంది ఉండగా.. కౌంటింగ్‌ సైన్యం.. విధుల్లోని ఉద్యోగులు 25,209 మంది ఉన్నారు. అబ్జర్వర్లు 119 కాగా.. పోలీసులు 42,000 మందిని నియమించారు. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉన్నారు. టేబుళ్లు (అసెంబ్లీ) 2,446 కాగా.. పార్లమెంటు కోసం 2,443 ఏర్పాటు చేశారు.

Election Results : తెల్లారింది లెగండోయ్ !

Read more AP News and Telugu News

Updated Date - Jun 04 , 2024 | 11:37 AM