Home » AP Election Counting
ఏపీలో రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విజయం సాధించారు. తూర్పు, పశ్చిమగోదావరి స్థానంలో కూటమి అభ్యర్థి స్పష్టమైన మెజార్టీతో ముందుకు దూసుకెళ్తున్నారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
అవును.. అనుకున్నట్లే జరిగింది..! ఏపీ ప్రజలు కూటమికే ఓటేశారు.. కనివినీ ఎరుగని రీతిలో సీట్లు కట్టబెట్టి అధికారమిచ్చారు. పేరుగాంచిన ప్రాంతీయ, జాతీయ మీడియా.. సర్వే సంస్థలు చేసిన సర్వేలన్నీ అక్షరాలా నిజమయ్యాయి. ఊహించిన దానికంటే ఎక్కువే సీట్లు దక్కాయని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ఇక ఎక్కడా చూసినా పసుపు జెండాలే రెపరెపలాడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ చేసిన దాడులు అన్నీ ఇన్నీ కావు..! ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అయితే వైసీపీ నేతలు, అభ్యర్థులు విర్రవీగిపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం ప్రవర్తించారు. ఆఖరికి టీడీపీ అభ్యర్థులపైన దాడులు చేసి..
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అరాచకాలు, అక్రమాలకు పాల్పడి, అల్లకల్లోలం సృష్టించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డిపై మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం రౌడీషీట్ ఓపెన్ చేసినట్టు తెలిసింది.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో రాజధాని అమరావతి రైతులు, ప్రజలు సంబురాలు చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో రైతులు మళ్లీ అమరావతిని రాజధానిగా చేస్తారని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారాన్ని కూడా అమరావతిలోనే చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ రెడ్డి (Jagan Reddy) చెప్పినట్లే ఏపీ ఫలితాలు చూసి దేశం ఆశ్చర్యపోయిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు 5 కోట్ల ఆంధ్రుల విజయమని చెప్పారు.
సైకిల్ కూటమి సునామీలో అనంతలో అధికార పార్టీ గల్లంతైంది. ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీకీ సాధ్యం కాని తిరుగులేని, చారిత్రక విజయాన్ని టీడీపీ కూటమి సొంతం చేసుకుంది. మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమ ఖాతాలో వేసుకున్నాయి. ఒక దశలో గుంతకల్లు, ధర్మవరం, కదిరి, మడకశిర నియోజకవర్గాలలో ఒకటో రెండో వైసీపీ ఖాతాలోకి వెళుతున్నట్లు కనిపించాయి. కానీ అలాంటి అవకాశాన్ని ఓటర్లు ఏమాత్రం ఇవ్వలేదు. గంపగుత్తగా చంద్రన్నకు కానుకగా ఇచ్చేశారు. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 12 స్థానాలను టీడీపీ గెలిచింది. 1994లో ఎన్టీఆర్ ప్రభంజనంలో ఒక్క తాడిపత్రి మినహా 13 అసెంబ్లీ స్థానాలను టీడీపీ, వామపక్ష కూటమి గెలిచింది. ఈ రికార్డులన్నింటినీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయాయి. ...
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఏపీ ఎన్నికల కౌంటింగ్పై ఫైనల్గా ఫుల్ పిక్చర్ వచ్చేసింది. ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలిచాయో లెక్క తేలింది. 175 అసెంబ్లీ సీట్లకు...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి గెలుపును తమ గెలుపుగా విశ్వవ్యాప్తంగా తెలుగువాళ్లు జరుపుకుంటున్నారు.