Share News

Chandrababu: ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

ABN , Publish Date - Jun 15 , 2024 | 01:43 PM

నటుడు సుమన్ తిరుమల శ్రీవారిని నేడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. ఏపీలో కూటమి ఘన విజయం సాధించడం శుభపరిణామమని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం 5ఏళ్ళు వెన్నక్కి వెళ్ళిందన్నారు.

Chandrababu: ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

తిరుమల: నటుడు సుమన్ తిరుమల శ్రీవారిని నేడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. ఏపీలో కూటమి ఘన విజయం సాధించడం శుభపరిణామమని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం 5ఏళ్ళు వెన్నక్కి వెళ్ళిందన్నారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో నూతన పరిశ్రమల ను స్థాపించడంతో పాటు ఐటీ సంస్థలను ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.


హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే దానికి చంద్రబాబే కారణమని సుమన్ తెలిపారు. అమరావతిని కాస్మోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెయ్యాలని పేర్కొన్నారు. తిరుపతితో పాటు ఈస్ట్, వెస్ట్ గోదావరిల్లో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చెయ్యాలని సుమన్ తెలిపారు. ఏపీలో సినిమాల చిత్రికరణకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలన్నారు. బీసీలకు నూతన ప్రభుత్వం పెద్ద పీట వేసిందని సుమన్ కొనియాడారు.

Updated Date - Jun 15 , 2024 | 01:43 PM