Share News

AP News: ఆరేళ్ల బాలుడి ఆయువు నిలిపిన వైద్యురాలు.. నడిరోడ్డుపైనే సీపీఆర్ చేసి..

ABN , Publish Date - May 17 , 2024 | 10:47 AM

ఓ వైద్యురాలి అప్రమత్తత ఆరేళ్ల బాలుడి ఆయువు నిలిపింది. రహదారి మీదనే సీపీఆర్ చేయడంతో బాలుడి ప్రాణం నిలిచింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో ‌వైరల్ అవుతోంది. వైద్యురాలు రవళికి ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. విజయవాడలోని అయ్యప్ప నగర్‌లో ఆరేళ్ల బాలుడు సాయి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

AP News: ఆరేళ్ల బాలుడి ఆయువు నిలిపిన వైద్యురాలు.. నడిరోడ్డుపైనే సీపీఆర్ చేసి..

వైద్యో నారాయణో హరి అంటారు. కొందరు డాక్టర్లు తమ వృత్తికి అక్షరాలా న్యాయం చేస్తారు. ఏదీ ఆశించకుండా సేవ చేస్తారు. అలాంటి ఘటనే విజయవాడలో జరిగింది. రోడ్డుపై అపస్మారక స్థితిలో ఉన్న ఓ బాలుడిని గమనించిన ఓ వైద్యురాలు తనకెందుకులే అని వదిలేయకుండా వెంటనే స్పందించింది. నడి రోడ్డుపైనే సీపీఆర్ చేసి బాలుడి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

AP Election Results: ఏపీలో ఎవరికి ఎన్నిసీట్లు? జోరుగా బెట్టింగులు..


విజయవాడ: ఓ వైద్యురాలి అప్రమత్తత ఆరేళ్ల బాలుడి ఆయువు నిలిపింది. రహదారి మీదనే సీపీఆర్ చేయడంతో బాలుడి ప్రాణం నిలిచింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో ‌వైరల్ అవుతోంది. వైద్యురాలు రవళికి ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. విజయవాడలోని అయ్యప్ప నగర్‌లో ఆరేళ్ల బాలుడు సాయి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. రోడ్డుపై వెళుతున్న తల్లిదండ్రులను గమనించి వెంటనే రవళి స్పందించింది. రోడ్డు పైనే పడుకోబెట్టి సీపీఆర్ చేసి ప్రాణాలు పోసింది. తరువాత ఆసుపత్రికి తరలించి పూర్తి చికిత్స చేయడంతో బాలుడు కోలుకున్నాడు. రవళి చేసిన పనికి అందరి నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి...

Hyderabad: రాష్ట్రంలో మళ్లీ భూమ్‌..

YSRCP: వైసీపీ నేతల ఇళ్లలో పెట్రోలు బాంబులు

Read Latest AP News And Telugu News

Updated Date - May 17 , 2024 | 10:48 AM