Share News

డిప్యూటీ సీఎం ఆదేశాలతో పాఠశాలకు విద్యుత్‌ సరఫరా

ABN , Publish Date - Oct 18 , 2024 | 11:43 PM

కొత్తపల్లి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆదేశాల మేరకు మండ లంలో నాగులాపల్లి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశా లకు విద్యుత్‌ సదుపాయాన్ని పునరుద్ధరించారు. నాగులాపల్లిలో ఏఎస్‌ఆర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వం నాడు-నేడు ఫేజ్‌2లో నూతన ఉ

డిప్యూటీ సీఎం ఆదేశాలతో పాఠశాలకు విద్యుత్‌ సరఫరా
నాగులాపల్లి ఉన్నత పాఠశాలలో వెలిగిన లైట్లు

కొత్తపల్లి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆదేశాల మేరకు మండ లంలో నాగులాపల్లి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశా లకు విద్యుత్‌ సదుపాయాన్ని పునరుద్ధరించారు. నాగులాపల్లిలో ఏఎస్‌ఆర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వం నాడు-నేడు ఫేజ్‌2లో నూతన ఉన్నత పాఠశాల నిర్మాణం చేపట్టారు. అనంతరం పాత ఉన్నత పాఠశాల నుంచి కొత్తగా నిర్మించిన పాఠశాలకు విద్యుత్‌ పునరుద్ధరించడం కోసం విద్యుత్‌శాఖ గత 2,3 నెలలుగా కాలయాపన చేశారు. విద్యుత్‌ సదుపాం లేక ఉపాధ్యాయులు, విద్యార్థులు పడు తున్న విషయం క్షేత్రస్థాయి పరిశీలనకు విచ్చేసిన డీప్యూటీ సీఎం పేషీ అధికారుల దృష్టికి రావ డంతో ఈ విషయం తెలుసుకున్న పాఠశాలకు తక్షణం విద్యుత్‌ సదుపాయం కల్పించాలని ఆ శాఽధికారులకు అదేశించారు. దీంతో వారు నాగు లాపల్లిలో నిర్మించిన పాఠశాలకు వెంటనే మీట రు అమర్చి విద్యుత్‌సౌకర్యాన్ని పునరుద్ధరించారు.

Updated Date - Oct 18 , 2024 | 11:43 PM