Share News

పారిశుధ్య కార్మికుల సేవలు నిరుపమానం : జేసీ

ABN , Publish Date - Oct 03 , 2024 | 12:07 AM

పిఠాపురం, అక్టోబరు 2: మన ప్రాంతాన్ని మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు నిరుపమానమని జిల్లా జాయింట్‌ కలెక్టరు రాహుల్‌మీనా అన్నారు. పట్టణంలోని చిన్నమాంబ పార్కు వద్ద బుధవారం విధుల్లో ఉన్న పారిశుధ్య కార్మికులతో ఆయన మాట్లాడారు. వా

పారిశుధ్య కార్మికుల సేవలు నిరుపమానం : జేసీ
పారిశుధ్య కార్మికులతో మాట్లాడుతున్న జేసీ

పిఠాపురం, అక్టోబరు 2: మన ప్రాంతాన్ని మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు నిరుపమానమని జిల్లా జాయింట్‌ కలెక్టరు రాహుల్‌మీనా అన్నారు. పట్టణంలోని చిన్నమాంబ పార్కు వద్ద బుధవారం విధుల్లో ఉన్న పారిశుధ్య కార్మికులతో ఆయన మాట్లాడారు. వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, గ్లౌజులు ఇస్తున్నారా లేదా ఇతర విషయాలను ఆరా తీశా రు. పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆయన వెం ట మన్సిపల్‌ కమిషనరు కనకారావు తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 03 , 2024 | 12:07 AM