Share News

ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాలి

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:08 AM

తుని రూరల్‌, సెప్టెంబరు 4: యువ నాయకత్వం ప్రజలు ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. యనమలతో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌ తేటగుంట క్యాంపు కార్యాలయంలో బుధవారం భేటీ అయ్యా రు. జిల్లా అభివృద్ధి ప్రణాళికపై చ

ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాలి
సీఎం సహాయనిధికి విరాళమందజేస్తున్న దృశ్యం

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల

తుని రూరల్‌, సెప్టెంబరు 4: యువ నాయకత్వం ప్రజలు ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. యనమలతో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌ తేటగుంట క్యాంపు కార్యాలయంలో బుధవారం భేటీ అయ్యా రు. జిల్లా అభివృద్ధి ప్రణాళికపై చర్చించారు. వర దలు, పునరావాసం తదితర అంశాలపై సమీక్షించారు. తునికి చెందిన మమతా హాస్పటల్‌ యా జమాన్యం, డాక్టర్‌ ఆర్‌.పుష్పారమావాణి రూ.2లక్షల ఆర్థిక సహాయాన్ని సీఎం సహాయనిధి కోసం యనమల, ఉదయ్‌ చేతులమీదుగా అందజేశా రు. కార్యక్రమంలో యనమల రాజేష్‌, సుర్ల లోవ రాజు, మోతుకూరి వెంకటేష్‌, చింతమనీడి నాగ సోమరాజు (అబ్బాయి), యనమల లక్ష్మణరావు, చోడిశెట్టి గణేష్‌, దండెం సురేష్‌ పాల్గొన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించాలి

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. వినాయకచవితి నేపథ్యంలో తొండంగి మండలం పెరుమళ్ళపురం సూర్యా విద్యాలయం విద్యార్థులు తయారు చేసిన మట్టి విగ్రహాలను యనమల చేతులమీదుగా పంపిణీ చేశా రు.యనమల రాజేష్‌, కొయ్యా కేశవ్‌, కొయ్యా సూరిబాబు, యాదాల రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:08 AM