Share News

Nijam Gelavali: నేటి నుంచి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన

ABN , Publish Date - Feb 06 , 2024 | 08:32 AM

అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌తో హఠాన్మరణం చెందిన కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి అండగా నిలుస్తున్నారు. వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో భువనేశ్వరి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.

Nijam Gelavali: నేటి నుంచి  నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన

అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌తో హఠాన్మరణం చెందిన కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి అండగా నిలుస్తున్నారు. వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో భువనేశ్వరి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. హఠాన్మరణం చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఓదారుస్తూ.. అండంగా ఉంటామంటూ భరోసా ఇస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి 4 రోజుల పాటు నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన చేయనున్నారు. ఈరోజు గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గంలో ఆమె పర్యటిస్తారు. బుధవారం (7వ తేదీ) తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. గురువారం (8వ తేదీ) తాడికొండ నియోజకవర్గంలో పర్యటిస్తారు. 9న (శుక్రవారం) నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఆమె పర్యటిస్తారు. భువనేశ్వరి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌‌ను టీడీపీ ఖరారు చేసింది.

Updated Date - Feb 06 , 2024 | 08:32 AM