Share News

గంజాయి పట్టివేత- ముగ్గురు అరెస్టు

ABN , Publish Date - Sep 20 , 2024 | 11:44 PM

మండలంలోని తేర్నాంపల్లె గ్రామంలో 2.70కేజీల గంజాయిని పట్టుకున్నట్లు రూర ల్‌ సీఐ వెంకటరమణ తెలలిపారు.

గంజాయి పట్టివేత- ముగ్గురు అరెస్టు
గంజాయి, నిందితులతో పోలీసులు

లింగాల, సెప్టెంబరు 20: మండలంలోని తేర్నాంపల్లె గ్రామంలో 2.70కేజీల గంజాయిని పట్టుకున్నట్లు రూర ల్‌ సీఐ వెంకటరమణ తెలలిపారు. సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం పప్రాంతంలో అందిన సమాచారం మేరకు గ్రామంలో ము గ్గురు వ్యక్తుల వద్ద గంజాయి ఉన్నట్లు తెలిసిందన్నారు. ఎస్‌ఐ మదుసూధనరావు, సిబ్బందితో కలిసి దాడులు చేశారన్నారు. ఈ దాడుల్లో షెక్షావల్లి, సబీర, కుళాయప్ప అనే ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి 2.70కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇతర ప్రాం తాల నుంచి గంజాయిని తెచ్చుకొని తాడిపత్రి, పులివెందుల తదితర ప్రాంతాలకు సరఫరా చేసేవారని గుర్తించామన్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Sep 20 , 2024 | 11:44 PM